చిరుతో న్యాయం జరిగేనా?

ఇలా కాంగ్రెసు నుండి వచ్చే విమర్శలను చిరంజీవి అధిష్టానం వద్ద తనకు ఉన్న పలుకుబడితోనో, రాష్ట్ర నేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యంతోనో ఎదుర్కొంటాడు. కానీ ప్రజారాజ్యం పార్టీలోని అసంతృప్తులను ఎలా ఎదుర్కొనగలడనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. సహజంగా రాజకీయ చాతుర్యం ఒంటబట్టని చిరంజీవి తన ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చలేడనే వాదనలు వినిపిస్తున్నాయి. సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడంపై కేవలం కడప కాంగ్రెసు నుండే విమర్శలు రావడం లేదు. కడప పిఆర్పీ నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. బొత్సతో ఫోన్ చేయించి కడప కాంగ్రెసు విమర్శలను సద్దుమణిగేలా చేసిన చిరంజీవి పిఆర్పీ నేతలకు సర్ది చెప్పగలరా అనేది చూడాలి. ఇన్నాళ్లూ టూర్లో ఉన్న చిరు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అసంతృప్తులు బయటపడినట్లుగా తెలుస్తోంది.
చిరు కాకుండా పదిహేడు మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ శోభానాగిరెడ్డి జగన్ వైపు వెళ్లారు. మిగిలిన పదహారు మందిలో తెలంగాణ అనీల తెలంగాణ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రకు చెందిన పలువురు కూడా మంత్రి పదవి కోసం పోటా పోటీగా ఉన్నారు. అందుకు వారు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసులో విలీనం కారణంగా కొందరు ఎమ్మెల్యేలు ఉన్న చోట బలమైన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో చిరుతో ఉంటే తమకు 2014లో సీటు ఖాయమవుతుందా అనే అనుమానం కూడా కొందరు ఎమ్మెల్యేలలో ఉంది. ఇప్పుడు మంత్రి పదవి, వచ్చే ఎన్నికల్లో సీటు, చిరుతో వెళితే తమకు కాంగ్రెసులో ప్రాధాన్యత ఉంటుందా ఇలా పలు ప్రశ్నలు పిఆర్పీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విలీనం, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత చిరుతో ఎందరు నేతలు ఉంటారా చూడాలి!












Click it and Unblock the Notifications