బాబుతో పోటీకి జగన్ వెనక్కి!
ఆయితే చంద్రబాబు 9వ తేదిన ఢిల్లీలో బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో జగన్ తన పోలవరం వేగవంత నిర్మాణం కోసం చేపట్టనున్న హరితయాత్రను పెంచారు. మొదట 9వ తేదిన పోలవరంలో యాత్రను ముగించి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే అదే 9వ తేదిన బాబు ఢిల్లీలో యాత్ర చేయడంతో జగన్కు పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో జగన్ ఒక అడుగు వెనక్కి వేసి యాత్రను 10వ తేది వరకు పొడిగించారు. అయితే బాబు ధర్నాకు, జగన్కు సంబంధం ఏమిటా అంటే జగన్ ఏ టార్గెట్తో అయితే లక్ష్యదీక్ష, జనదీక్ష, జలదీక్షలు చేపట్టారో అదే తాపత్రయంతో ఈ హరితయాత్రను నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అదే 9వ తేదిన ఢిల్లీలో చంద్రబాబు బహిరంగ సభ ఉన్నందున జాతీయమీడియాగానీ, రాష్ట్ర మీడియా కానీ దానిపైనే దృష్టి సారిస్తుంది. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, తొందరగా ముఖ్యమంత్రి కావాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, చంద్రబాబు ఢిల్లీ సభ కారణంగా మీడియా తనపై దృష్టి సారించదనే ఉద్దేశ్యంతోనే తన యాత్రను ఒకరోజుకు పెంచుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. దీంతో 9వ తేదిన జరగాల్సిన పోలవరం బహిరంగ సభ 10వ తేదికి మారినట్టుగా తెలుస్తోంది.