కిరణ్కు చెక్: ఆ 17 సీట్లపైనే బొత్స దృష్టి
మహ బూబ్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు చుక్కెదురైన తర్వాత కిరణ్కు చెక్ పెట్టే దిశగా బొత్స పావులు కదుపుతున్నారు. రాజ్యసభ అభ్యర్థులతో పాటు ఉప ఎన్నికలు జరిగే అవ కాశమున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బొత్స ముందుచూపుతోనే పార్టీ హైకమాండ్కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల గురించి చర్చించకుండానే జాబితాను అందజేశారంటే సిఎంకు చెక్పెట్టేందుకేనని అంటున్నారు. ఈ జాబితాలో సొంత వర్గం ఉండేలా బొత్స జాగ్రత్తలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి సతీమణి విజయలక్ష్మిని నిలబెట్టాలని బొత్స సత్యనారాయణ యోచించారు. ఇదే విషయమై సిఎంతో ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ బొత్స ఢిల్లీ పయనం అయిన వెంటనే విజయ లక్ష్మిని కాదని ముత్యాల ప్రకాష్ను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినా బొత్స మౌనంగానే ఉండిపోయారు. కానీ ఈసారి ముఖ్యమంత్రికి ఆ అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోవడం లేదు. మెజార్టీ స్థానాల్లో తన సొంత వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకొని పార్టీపై పట్టుసాధించాలని ఆయన యోచిస్తున్న ట్లు సమాచారం.