టార్గెట్ అదే: బొత్స వ్యూహం, కిరణ్ ప్రతివ్యూహం

కిరణ్ సోదరులు కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వెళుతున్నాయట. ఆయన వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి నష్టమని, మంత్రివర్గ విస్తరణకు కూడా అనుమతివ్వవద్దని అధిష్టానం వద్ద చెప్పారని అంటున్నారు. మరో విషయమేమంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించాలని పలువురు అధిష్టానాన్ని కోరారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో శంకర రావు సిఎంను మార్చాలంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను మాత్రం అలాంటి లేఖ రాయలేదని ఆయన అప్పుడే వివరణ ఇచ్చుకున్నారు. తనను గద్దె దింపేందుకు జరుగుతున్న వ్యూహాలకు సిఎం కిరణ్ కూడా ధీటుగానే ప్రతివ్యూహాలు రచిస్తున్నారట. ఇందులో భాగంగానే ఇటీవల బొత్సపై పలువురు నేతలు ఫిర్యాదు చేశారని అంటున్నారు.
బొత్స పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఎవరూ ఉత్సాహంగా పని చేయడం లేదని, మంత్రులపై ఆయన అప్పుడే పెత్తనం చేస్తున్నారని, పలు విషయాల్లో మంత్రులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అధిష్టానానికి చెబుతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్స్లు, హైదరాబాద్కు పెద్ద నేతలు వచ్చినప్పుడే ఫిర్యాదులు చేసిన కిరణ్ వర్గం తాజాగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసేందుకు కూడా సన్నద్ధమవుతోందట. బొత్సను మారిస్తే కోస్తాలో అసలు కాపు వర్గానికి చెందిన నేతకు ఆ పదవి ఇవ్వవచ్చునని, ఆయన హడావుడి వల్ల కాపులే పార్టీకి దూరమయ్యే అవకాశముందని చెప్పనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఇరువురు ఒకరికొకరిని పదవుల నుండి దింపడమే టార్గెట్ చేసుకున్నారని కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications