తెలంగాణ, బైపోల్స్: బొత్స పైన భారం

అదే సమయంలో ఉప ఎన్నికలలో సహకరించేందుకు పార్టీ నేతలు వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి బొత్స సహాయ సహకారాలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇది సత్తిబాబు సత్తాకు పరీక్షగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ ఎంపీలకు ఎలాగైనా నచ్చజెప్పాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా చెప్పడంతో బొత్సతో పాటు కాంగ్రెస్ పెద్దలు వయలార్ రవి, గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగారు.
బొత్స సత్తిబాబు తెలంగాణకు వ్యతిరేకంగా లేకపోవడం వారిని కన్వీన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఎన్నకైన సమయంలోనూ పలువురు తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బొత్స ఎంపిక కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనేందుకు నిదర్శనమని వారు చెప్పారు.
బుధవారం ఉదయం రవితో కలిసి కెకె ఇంట్లో తెలంగాణ ఎంపీలతో బొత్స చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని, ఉప ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ వేచి చూడాలని వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కావాలని, అప్పుడే తాము వెనక్కి తగ్గడానికి వీలవుతుందని ఎంపీలు గట్టిగా చెప్పారు. దీనిపై మరింత చర్చించాలని అందరూ నిర్ణయించారు.
అదే సమయంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి కావడంతో పార్టీ విజయావకాశాలపై పార్టీ ఎంపీలతో సత్తిబాబు చర్చలు సాగించారు. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, ఎంపిలు కెవిపి రామచందర్ రావు, సాయి ప్రతాప్. చిరంజీవి, కెఎస్ రావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, జెడి శీలం, అనంత వెంకట రెడ్డి, చింతామోహన్ తదితరులతో వేర్వేరుగా, కలిసికట్టుగా చర్చించారు.
వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచర స్థితిలో పడుతుందని, అందరూ కలిసి పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేయాలని బొత్స వారిని కోరారని సమాచారం. సగానికి పైగా సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎంపీలతో జరిపిన సమీక్షలో ఆయన తేల్చారట. అయితే ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో కొందరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఒకరిద్దరిని మార్చే అవకాశాలున్నాయని బొత్స చెప్పారట.
పార్టీ తరఫున తీవ్రంగా కృషి చేస్తానని, అందరినీ కలుపుకొనిపోతానని, అయితే ఓటమికి మాత్రం తనను బాధ్యుణ్ని చేయొద్దని ఢిల్లీ పెద్దలను బొత్స కోరినట్లు సమాచారం. ఆజాద్కు ఇదే విషయం చెప్పారు. బుధవారం పార్లమెంట్ లాబీలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను కూడా కలిశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications