వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు కులాలు, ఆ రెండు పత్రికలు

By Staff
|
Google Oneindia TeluguNews


Y S Rajasekhar Reddy గతంలో వైఎస్ మాటి మాటికీ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించేవారు. కోస్తా ఆంధ్రకు చెందిన ఒక అగ్రకులం చేతుల్లో ఆ రెండు పత్రికలు ఉండడం, అవి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అదేపనిగా వార్తాకథనాలు రాయడం వైఎస్ కు చికాకు కలిగించి ఉండవచ్చు. ఇప్పుడు వైఎస్ స్వయంగా "సాక్షి" పత్రిక పెట్టుకుంటున్న నేపధ్యంలో ఆయన ఆ రెండు పత్రికల మీద దాడి చేయడం మానుకున్నారు.

రెడ్డి కులస్తులు ఈ రాష్ట్రాన్ని 32 ఏళ్ళు, కమ్మ కులస్ధులు 16 ఏళ్ళు పరిపాలించారని, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బిసి,ఎస్ సి, ఎస్ టిలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారని బలహీనవర్గాల సాధికార వేదిక గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ వేదిక చైర్మన్ గా మాజీ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు వ్యవహరిస్తున్నారు. ఈ వేదికకు కొందరు ప్రొఫెసర్లు బాసటగా ఉన్నారు. చిరంజీవి పార్టీకి ఈ వేదిక వెలుపలి నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X