వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిపిని వైఎస్ ఏంచేస్తారు?

By Staff
|
Google Oneindia TeluguNews

Yadav
డిజిపి ఎస్ ఎస్ పి యాదవ్ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని సంప్రదించకుండా పోస్టింగులు ఇస్తున్నారని ప్రభుత్వ పత్రిక "సాక్షి"లో ప్రముఖంగా ఒక కథనం వచ్చింది. కానీ రాజశేఖరరెడ్డి తన కొడుకు పత్రిక కంటే తాను నమ్మిన వ్యక్తులకు ఎక్కువ విలువ ఇస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.

ఎన్నికల సంఘం యాదవ్ ను తప్పించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని ఇడుపులపాయలో మఫ్టీలో కలుసుకున్న విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఎవరి గురించి అయినా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ నెగిటివ్ గా వస్తే ముఖ్యమంత్రి వైఎస్ వాటిని అనుకూలంగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు తన కుమారుడి పత్రికలో యాదవ్ గురించి వచ్చిన వ్యతిరేక వార్తాకథనాన్ని ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే యాదవ్ ఇచ్చిన పోస్టింగుల మీద ముఖ్యమంత్రి స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X