వైఎస్ జగన్ యాత్ర విజయవంతం కావడంతో సంక్షోభం
అయితే, పార్టీలో కొన సాగుతున్న గందరగోళం వల్ల తటస్థంగా వ్యవహరిస్తోన్న ఎమ్మె ల్యేలు ఎటూ మొగ్గకుండా మౌనంగా ఉన్నారు. మరోవైపు జగన్ వ్యతిరేక ఎమ్మెల్యేలయితే కావాలనే దూరంగా ఉంటున్నారు. అయితే.. వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలివెళుతుండటం ఎమ్మెల్యేలను కలవర పరుస్తోంది.ఈ పరిణామాలు ముదురుపాకాన పడితే స్థానికంగా పట్టు పోతుందన్న భయం మొదలయింది. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి విఫలమయిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గా ల్లోని ఒకటి రెండు మండలాల్లో హవా ఉన్న నేతలతోపాటు, ఇప్పటి నుంచే ఎదుగుదామనుకుంటున్న యువ నేతలు జగన్ యాత్రకు కార్యకర్తలతో యాత్రకు తరలివెళుతున్నారు. వీరిలో అధిక శాతం నేతలు ఇప్పటివరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనుకే ఉన్నారు. జగన్ కొత్త పార్టీ పెట్టే వ్యూహంతోనే యాత్ర నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగు తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తును కొత్త పార్టీ నుంచి మొదలుపెట్టాలన్న ఆశ ఉన్న నేతలు, ఇప్పటినుంచేజనబలం ప్రదర్శించే పనిలో ఉన్నారు. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తోంది.