వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవార్ తో వైయస్ జగన్ రాజకీయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రైతు సమస్యలపై విన్నవించే నెపంతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్ రాజకీయ మంతనాలు జరిపినట్లు ఊహాగానాలు చెలరేగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్ జగన్ గురువారం శరద్ పవార్ ను కలిసి రాష్ట్రంలోని రైతు సమస్యలపై విన్నివించారు. ఇదే సమయంలో ఆయన రాజకీయ వ్యవహారాల గురించి పవార్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపిని స్థాపించి శరద్ పవార్ కాంగ్రెసును తిప్పలు పెట్టిన విధంగానే తాను కూడా ఆంధ్రప్రదేశ్ లో తాను ముందుకు నడవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో శరద్ పవార్ తో కలిసి పని చేసే విషయంపై కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ తన పార్టీ స్థాపనపై ఇతరత్రా వ్యవహారాలపై పవార్ మాట్లాడినట్లు చెబుతున్నారు. ఏమైనా, భవిష్యత్తులో శరద్ పవార్, వైయస్ జగన్ కలిసే అవకాశాలున్నట్లు మాత్రం ప్రచారం సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X