వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర నేతలకు బ్రెయిన్ వాష్

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
ఇటీవల తనను కలవడానికి వచ్చిన సీమాంధ్ర నాయకులకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం బ్రెయిన్ వాష్ చేసినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రాని సమైక్యంగా ఉంచాలని, ముక్కలు చేయవద్దని కోరడానికి పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు చిదంబరాన్ని కలిశారు. ఆ సందర్భంలో ఆయన వారిపై చిర్రుబుర్రులాడినట్లు ఊహాగానాలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చెందిన టీవీ చానెల్ టీ- న్యూస్ చానెల్ అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేసింది. ప్రత్యర్థుల విషయంలో అన్ని చానెళ్లు అనుసరించిన పంథానే ఈ చానెల్ కూడా ప్రవర్తించిందనే మాట కూడా వినిపిస్తోంది.

తెలంగాణ విషయంలో చిదంబరం ప్రభుత్వపరమైన కోణంలో ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత సీన్ రివర్సైంది. ఇప్పటికీ ఆయన ప్రభుత్వపరంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై కచ్చితమైన వైఖరిని ప్రకటించాలని ఆయన అడుగుతున్నారు. మిగతా కాంగ్రెసు అధిష్టానం పెద్దలు పార్టీపరంగా ఆలోచన చేస్తున్నారు. అందుకే, మిగతా నేతల వద్ద ఎదురుకాని వ్యతిరేకత సీమాంధ్ర నేతలకు చిదంబరం వద్ద ఎదురైనట్లు భావిస్తున్నారు.

English summary
It is said that Union Home minister P Chidambaram brain washed the Congress Seemandhra leaders on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X