యడ్యూరప్పకు ధర్మస్థలి గండం!

ఇటీవల జెడి(ఎస్) నేత కుమారస్వామి, యడ్డీలు అక్రమాలు, అవినీతిపై పవిత్ర పుణ్యస్థలం అయిన ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆలయ పూజారులు ధర్మస్థలలో రాజకీయ నాయకులు అలాంటి ప్రమాణాలు చేయవద్దని సూచించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ప్రమాణం చేస్తామని ప్రకటించిన రోజు కుమారస్వామి ధర్మస్థల వెళ్లారు. యడ్డీ కోసం కాసేపు నిరీక్షించి ఆయన రావడం లేదని వెనక్కి తిరిగి వెళ్లి పోయారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని అబద్దాలు చెప్పి పవిత్ర స్థలంలో ప్రమాణానికి సిద్ధమైనందునే ఆయనకు పదవీ గండం పట్టిందని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications