అఖిలేష్ యాదవ్ ముందు అన్నీ సవాళ్లే

అంతేకాకుండా మేనిఫెస్టోలోని పథకాలు అమలుపర్చడం ఆయనకు మరో సవాల్. విద్యార్థులకు టాబ్లెట్ పిసిలు, ల్యాప్టాప్లు కష్టంతో కూడుకున్న పని. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందరికీ అవి పంచితే ఆర్థికంగా ప్రభుత్వంపై పెనుభారం. నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ కూడా కష్ట సాధ్యం. మంత్రివర్గంలో యువతకే ఎక్కువ పీట వేయాలని భావిస్తున్న అఖిలేష్కు సీనియర్ల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి దేశ రాజకీయాలను మలుపు తిప్పగల యుపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అఖిలేష్కు అనుభవం కూడా చాలా తక్కువ. మరి ఎంత మేరకు ఆయన సఫలం అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications