నడవలేని స్థితిలో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

'నాకు వెన్నునొప్పి తీవ్రంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసమైనా బెయిల్ మంజూరు చేయండి' అని ఆమె కోరారు.
ఈ మేరకు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 24, 29వ తేదీల్లో నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లినపుడు వెన్నునొప్పికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఓఎంసీ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.. బెయిల్ పిటిషన్పై 3న కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సీబీఐకి సూచించి, కేసు ను అదే రోజుకు వాయిదా వేశారు.
తోడు లేకుండా నడవలేక పోతున్నానని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్లో చెప్పుకున్నారు. అత్వసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, చికిత్స చేయకపోతే ఎడమ పాదం స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారని ఆమె అన్నారు. రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు.
కోర్టుకు ఆమె వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా సమర్పించారు. గత నెల 24, 27 తేదీల్లో శ్రీలక్ష్మిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో కూడా ఆమెకు పరీక్షలు చేశారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. మానసికంగా కూడా శ్రీలక్ష్మి కుంగిపోయినట్లు చెబుతున్నారు. అంత చలాకీ అధికారికి ఇంత కష్టమా....
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications