విభజన: హైదరాబాద్పై కొత్త ప్రతిపాదన
హైదరాబాద్ విషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమయ్యే ఫార్ములాను రూపొందించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను శాశ్వత నగర రాష్ట్రంగా మార్చాలని వస్తున్న డిమాండ్ సాధ్యం కాదని, దీనివల్ల తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని, తరుచూ రాజకీయ ఆస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోంది.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రతిపాదనను హైదరాబాద్కు చెందిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాదును స్వయంప్రతిపత్తి కలిగిన ప్రత్యేక పరిపాలనా మండలిగా ప్రకటించే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.
నదీజలాల పంపకంపై, హైదరాబాద్పై ఉన్న విభేదాలను ఆంటోనీ కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మొత్తం మీద, విభజనపై ముందుకు సాగుతూనే సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై సోనియా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.