చిరంజీవి అభిమానుల అవహేళన: తగ్గిన షర్మిల

గురువారం ఆమె చిరంజీవిని విమర్శించినప్పుడు మెగాస్టార్ అభిమానులు ఆమెను అవహేళన చేశారట. ఆమె వేలాది మంది కార్యకర్తలతో కాకినాడలోకి ఎంటర్ అయ్యారు. ఆమె జగన్నాయకపూర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విపక్షాలపై సిబిఐని ఉసిగొల్పుతూ.. పార్టీ నేతలను మాత్రం కాపాడుతోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో ఆమె చిరంజీవి పేరును ప్రస్తావించారు. కొద్ది నెలల క్రితం చెన్నైలోని చిరంజీవి బంధువు ఇంట్లో రూ.90 కోట్లు దొరికాయని, అయినప్పటికీ దానిపై ఎలాంటి విచారణ జరగడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న కొందరు చిరు అభిమానులు ఎద్దేవా చేశారట. దీంతో చిరంజీవి పేరు ప్రస్తావించడంతో ఎదురైన ఇబ్బందిని గుర్తించిన షర్మిల వెంటనే తన ప్రసంగాన్ని మార్చారట.
ఆ వెంటనే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పేరును ఎత్తుకున్నారట. బొత్స లిక్కర్ మాఫియా అని మండిపడ్డారు. బొత్స లిక్కర్ మాఫియా అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించే ఎలాంటి అవిశ్వాసానికైనా తాము మద్దతిస్తామని షర్మిల చెప్పారు. ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలపై వేటును ఆలస్యం చేశారని ఆమె ఆరోపించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications