'జగన్' చిచ్చు!: నాగ్, బాలయ్యల మధ్య గ్యాప్

ఈ కార్యక్రమానికి హాజరైన వీరు ఎదురుపడ్డా పలకరించుకోలేదట. అంతేకాకుండా శ్రీరామరాజ్యం చిత్రానికి అవార్డును అందుకున్న బాలకృష్ణ ఆ చిత్రంలో వాల్మీకి పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించక పోవడం చర్చనీయాంశమైంది. నాగ్, బాలయ్యలు కార్యక్రమంలో చాలా సేపు ఉన్నప్పటికీ పలకరించుకోలేదు. ఎదురుపడ్డా ఏమీ మాట్లాడుకోలేదు. కనీసం ఒకరి మొహాలు ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడలేదట.
అందుకేనా?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను నాగార్జున తరుచూ కలస్తుండటం, ఆ పార్టీ నేతలతో నాగార్జున సన్నిహితంగా మెలుగుతున్నాడనే ప్రచారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల నాగార్జునను కూడా టార్గెట్ చేసుకుంది. ఈ కారణంగానే వారి మధ్య శత్రుత్వం లేకున్నా ప్రత్యర్థులుగా మారారంటున్నారు.
నాగార్జున వ్యాపారాల పైన టిడిపి నేతలు ఇటీవల విరుచుకుపడుతున్నారు. నాగార్జున వ్యాపారాలపై దృష్టి సారించాలని, ఆయనను కూడా విచారించాలని టిడిపి డిమాండ్ చేసింది. దీంతో నాగార్జున టిడిపిపై కోపంగా ఉన్నారని, అదే ఆగ్రహం ఆ పార్టీకి చెందిన నేత బాలయ్యపై కూడా సహజంగా ఉందని అంటున్నారు. మరోవైపు నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం నచ్చని బాలయ్య మాట్లాడేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. మొత్తానికి వారి మధ్య రాజకీయ చిచ్చు ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications