రాని ఆహ్వానం: బాబుపై మళ్లీ అలిగిన హరికృష్ణ?

ముఖ్యమైన కార్యక్రమాలను తిరుపతి నుంచి మొదలు పెట్టడం ఆనవాయితీగా చేపడుతున్న చంద్రబాబు ఈ సభలనూ అక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అన్ని జిల్లాల్లోనూ ఈ సభలను నిర్వహిస్తామని బాబు తెలిపారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, తెలుగు జాతికి పునర్వైభవం తేవడం లక్ష్యంగా తాము సభలను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. ఈ ప్రజా గర్జన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణకు ఆహ్వానం అందలేదంట. దీంతో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న ఆయన ప్రజా గర్జనకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారట.
చంద్రబాబుకు హరికృష్ణ మొదటి నుండి కొరకరాని కొయ్యలా తయారయిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ అంశంలోను పార్టీ నిర్ణయం మేరకు బాధాకరమైనా విభజనకు కట్టుబడి ఉన్నానని లేఖ రాసిన హరి... ఆ తర్వాత కొద్ది రోజులకే మనసు మార్చుకొని పార్టీ లైన్ నుండి మారారు. రాజీనామాల విషయంలోను సొంత ఎంపీలు తనను మోసం చేసినట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రజా గర్జనకు ఆహ్వానం అందక పోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నారట.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications