జైల్లో లాలూకు భగవద్గీత: కేబుల్ టీవి కోరిక
అప్పర్ డివిజన్ బ్లాక్లో వివిఐపి గదిని కేటాయించినప్పటికీ జైలు రాత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనాకష్టంగా గడిపారట. సోమవారం ఆయనను రాంచీ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ లభించే వరకు మూడేళ్లకు పైగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అదే బ్లాక్లో ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ గదిలో ఉన్న టెలివిజన్ సెట్కు కేబుల్ కనెక్షన్ లేదు. దీంతో ఆయన కేబుల్ కనెక్షన్ కోసం విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. కేబుల్ కనెక్షన్ కోసం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జైళ్ల శాఖ జార్ఖండ్ ఐడిపి శైలేంద్ర భూషణ్ చెప్పారు.
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 25 మంది సీనియర్ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ను జైలులో కలిసి సంఘీభావం తెలిపారు. తాను లాలూకు భగవద్గీత ఇచ్చి, అందులోని గొప్ప శ్లాకాలను చదవాలని సూచించినట్లు వైశాలీ ఎంపి రఘువంశ్ ప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయం కనీసం గంటపాటు మార్నింగ్ వాక్ చేయాలని తాను సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.