అధిష్టానంపై శివాలెత్తిన రేణుకా చౌదరి

ఖమ్మం స్థానం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ పోటీ చేస్తున్నారు. ఖమ్మం లోకసభ సీటుకు రేణుకా చౌదరి 1999లోనూ, 2004లోనూ ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు చేతిలో ఓటమి పాలయ్యారు.
తెలంగాణలో పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం మహిళలను పట్టించుకోలేదని రేణుకా చౌదరి విమర్శించారు. మహిళ సాధికారిత గురించి వేదికల మీద అందరూ చెప్తారని, అయితే అసలు విషయానికి వచ్చే సరికి వారిని విస్మరిస్తారని ఆమె అన్నారు.
ఖమ్మం లోకసభ సీటు నుంచి తనను కాదని పోటీ చేసే మగాడు ఎవడంటూ రేణుకా చౌదరి ఆ మధ్య ఓసారి అన్నారు. అయితే, రేణుకా చౌదరిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు మొదటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆమెను తెలంగాణ బిడ్డ కాదంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications