తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి
హైదరాబాద్: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పాల్గొనలేకపోయారు. లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవడంతో ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుదిరిగారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం మంగళవారంనాడు ఒక రోజు సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాదులోని కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు ఇచ్చారు.

సమగ్ర సర్వే దరఖాస్తులో అప్పులు నమోదు చేసే కాలమ్ ఎందుకు లేదని తెలుగుదేశం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు ఆయన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు.
సామాన్యుల అప్పులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ప్రముఖుల ఇల్లలోని వివరాలను కూడా ఎన్యుమరేటర్లు సేకరిస్తున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన సర్వే తర్వాత ఊపందుకుంది.
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ!












Click it and Unblock the Notifications