తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి
హైదరాబాద్: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పాల్గొనలేకపోయారు. లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవడంతో ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుదిరిగారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం మంగళవారంనాడు ఒక రోజు సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాదులోని కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు ఇచ్చారు.

సమగ్ర సర్వే దరఖాస్తులో అప్పులు నమోదు చేసే కాలమ్ ఎందుకు లేదని తెలుగుదేశం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు ఆయన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు.
సామాన్యుల అప్పులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ప్రముఖుల ఇల్లలోని వివరాలను కూడా ఎన్యుమరేటర్లు సేకరిస్తున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన సర్వే తర్వాత ఊపందుకుంది.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications