ఫొటోలు: సచిన్, ధోనీ, యువీలపైనా అనుమానమా?
న్యూఢిల్లీ: బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అనుమానిత బుకీ కరణ్ గిల్హోత్రాతో ఫొటో దిగడంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఓ అనుమానిత బుకీతో బీసీసీఐ కార్యదర్శికి పనేమిటని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఐసీసీ లేఖ రాసింది.
అనురాగ్ విషయంలో సందేహాన్ని వ్యక్తం చేసిన ఐసీసీ సచిన్, ధోనీ, యువీలపైనా ఇదే తీరుగా స్పందిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సల్మాన్ ఖాన్ లాంటి సెలెబ్రిటీస్తోనూ గిల్హోత్రా కలిసి దిగిన ఫొటోలున్నాయి. గిల్హోత్రాకు సెలెబ్రిటీస్తో పరిచయాలు పెంచుకోవడం, వారితో కలిసి తిరగడం, ఫొటోలు దిగడం అంటే మహా సరదా అట.

2009 దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్లో ఆ లీగ్ లోగో ఉన్న ఓ ఐడీ కార్డు మెడలో వేసుకుని ధోనీతో దిగిన ఫొటో కూ డా ఉంది. దీనిపై స్పందించిన గిల్హోత్రా, ఆ కార్డు తాను దొంగిలించింది కాదని, ఓ హోదాతో ఆ లీగ్కు హాజరయ్యానని చెప్పాడు. ఆ హోదా ఏమిటో సరిగా గుర్తుకురావడం లేదని చెప్పాడు.
ఐసిసి అనుమానాలపై అనురాగ్ ధాటిగానే కౌంటర్ ఇచ్చాడు. దీని వెనుక ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ హస్తముందని, తానంటే గిట్టకే ఈ వివాదానికి తెరతీస్తున్నాడని ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇదే అనుమానిత బుకీ కరణ్ గిల్హోత్రా గతంలో యువరాజ్ సింగ్, ధోనీ, సచిన్ టెండూల్కర్లతో పాటు మరికొందరు క్రికెటర్లతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు బయటికొచ్చాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications