రూపాయి అడిగితే, తన్నిన మహిళా మంత్రి(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి... ఓ వ్యక్తి రూపాయి దానం అడిగినందుకు కాలితో తన్నారు. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఇది వివాదాస్పదమైంది. ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే మానవత్వాన్ని మరిచారు.
దానంగా ఒక రూపాయి అడిగాడనే కారణంతో ఓ అడుక్కునే పిల్లాడిని కాలితో తన్నింది సదరు మహిళా మంత్రి. భోపాల్కు సమీపంలోని పన్నాలో జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్లో చెత్త ఊడ్చే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా దానం చేయాలని ఓ పిల్లాడు అభ్యర్థించాడు. దాంతో అసహనానికి గురైన మంత్రి బాలుడిని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా పసివాడిపై అంగరక్షులు చేయిచేసుకున్నారు. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది.
మంత్రివర్గం నుంచి కుసుమ్ మెహ్దేలేను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా, సదరు మహిళా మంత్రి గతంలోను వివాదాల్లో కూరుకుపోయారు. ఇటీవల సింహాలను, పులులను ప్రజలు పెంచుకొనే విధంగా చట్టాన్ని రూపొందించాలని వ్యాఖ్యానించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications