బాహుబలి కట్టప్పను వదిలేసి షీనాపై నెటిజన్లు
హైదరాబాద్: నెటిజన్లు బాహుబలి సినిమాలోని కట్టప్పను వదిలేసి షీనా బొరా హత్య కేసుపై పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి బాహుబళి సినిమాపై ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఆ చర్చకు సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసు బ్రేకులు వేసింది. ఇప్పుడు షీనా బొరా ఉదంతంపై హాట్ హాట్గా చర్చ సాగుతోంది.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంపై పలు రకాల వ్యాఖ్యలు సరదా కామెంట్లు సోషల్ మీడియాలో చోటు చేసుకుంటూ వచ్చాయి. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, దానికి గల కారణాలు ఏమిటినే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు.
సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు, బాహుబలి చిన్నతనంలో కట్టప్ప కంచం లాక్కున్నాడని అందుకే కట్టప్ప బాహుబలిని చంపాడని కొందరు చెప్తే, మరికొందరు మాత్రం మిర్చిలో సత్యరాజ్ భార్య నదియ మరణానికి ప్రభాస్ కారణం కావడంతో, అందుకు ప్రతీకారంగానే కట్టప్ప బాహుబలిని చంపాడని కొందరు సోషల్ మీడియాలో వివరించారు.
ప్రస్తుతం దేశంలో షీనా బోరా హత్య కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రాణి ముఖార్జియా కుటుంబంలోని సంబంధాల గురించి నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. షీరా బోరాను ఎవరు హత్య చేశారు, అందుకు గల కారాణాలు ఏమిటి, అసలు ముఖర్జీయా కుటుంబ చరిత్రలో ఎవరికి ఎవరు ఏమౌతారు, వారి మధ్య వున్న సంబంధాలు నిజమైనవేనా అనే ప్రశ్నలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.