గన్నవరంపై బాబు ప్లాన్:భూమి కోల్పోనున్నకృష్ణంరాజు
విజయవాడ: ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు తమ భూములు కోల్పోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుగు ప్రముఖ నటుడు కృష్ణం రాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్లు తమ తమ భూములను విమానాశ్రయం కోసం కోల్పోనున్నారని తెలుస్తోంది.
కృష్ణంరాజు, అశ్వనీదత్లకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయ సమీపంలో దాదాపు 70 ఎకరాల భూమి ఉంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి తీర్చిదిద్దాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాన్ని తీసుకోనుంది.

ఈ నేపథ్యంలో పలువురి భూములు ప్రభుత్వం తీసుకొని, వారికి పరిహారం ఇవ్వనుంది. అందులో కృష్ణంరాజు, అశ్వనీదత్ల భూములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గన్నవరం విమానాశ్రయం కోసం భూసేకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. దీనికి ఆయా భూయజమానుల నుండి సానుకూల స్పందన వస్తోంది.
అజ్జంపూడి, బుధ్దవరం, కేసరపల్లి... ఈ మూడు గ్రామాలు విమానాశ్రయ భూముల పరిధిలోకి వస్తున్నాయి. ఈ గ్రామాల రైతులు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంను పరిగణలోకి తీసుకొని... గన్నవరం వద్ద కూడా వరల్డ్ క్లాస్ విమానాశ్రయం నిర్మించేందుకు ప్రముఖ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
-
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న హీరో -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications