కుబేరుడికి నిబంధనలు?: అంబానీ కోసం అర్ధరాత్రి తెర్చుకున్న అలిపిరి గేట్లు!
తిరుపతి: ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన కోసం తిరుమలలోని అలిపిరి టోల్గేట్ అర్ధరాత్రి ఒంటిగంటకు తెరుచుకుంది. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. ఆ కుబేరుడికి అర్ధరాత్రి టోల్గేట్ తెరిచి తిరుమలకు స్వాగతం పలికారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.

ముకేష్ అంబానీ గురువారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. సాధారణంగా ప్రతి రోజు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు టోల్గేట్ మూసి ఉంటుంది. అయినప్పటికీ టీటీడీ అధికారులు ముఖేష్ అంబానీ కోసం అర్ధరాత్రి టోల్గేట్ను తెరిచి కొండపైకి పంపడం పలు విమర్శలకు తావిస్తోంది.
శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తనయుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
-
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications