ఆంజనేయస్వామి విగ్రహం కంట నీరు!
ఖమ్మం: జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని హనుమాన్ విగ్రహం కంటతడి పెడుతున్న దృశ్యం కనిపించింది.
స్థానికుల కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లిలో మూడేళ్ళ క్రితం ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడితో చర్చించారు. దీనిపై ఆగ్రహించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు.. పూజారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో గత రెండు రోజులుగా ఆలయం మూసివేశారు.

అనంతరం దిగివచ్చిన పాలకమండలి అధ్యక్షుడు అందరితో కలిసి తిరిగి తన పొరపాటును ఒప్పుకున్నారు. దీంతో అందరి సమక్షంలో పూజారి సోమవారం ఆలయ ద్వారాలు తెరిచారు. ఆ సమయంలో ఆంజనేయ విగ్రహం కంట నీరు కారుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఈ విషయం జిల్లా అంతటా దావానంలా వ్యాపించింది. దీనితో వివిధ గ్రామాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. స్థానికులు మాత్రం ఆంజనేయుడు కలతచెందడం వల్లే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, అయితే గోడ చమర్చడంవల్లే ఈ నీరు వస్తోందని, అంతకు మించి మహత్తు ఏమీలేదని జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు చెబుతున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications