షాక్: అంబానీ సోదరుల మధ్య 'జియో' చిచ్చు
టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది.
ముంబై: టెలికం మార్కెట్ లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టింది. జియో పై ఆర్ కాం సంచలన ఆరోపణలు చేసింది. ముఖేస్ అంబానీ గ్రూప్ కు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాల పాలైందని ఆరోపించి ఆర్ కామ్.
అనిల్ అంబానీ నేతృత్వంలో ఆర్ కామ్ పనిచేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకొనేందుకుగాను మార్కెట్ షేర్ పెంచుకొనేందుకుగా జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది ఆర్ కామ్ సంస్థ. దేశీయ టెలికం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్ కామ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆరోపించింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్ కామ్ జియో పై పలు ఆరోపణలు గుప్పించింది.మార్చిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్లే టెలికం కంపెనీ నష్టాలపాలైనట్టుగా ఆ సంస్థ ఆరోపణలు చేసింది.
చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా టెలికం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది.












Click it and Unblock the Notifications