జయలలిత మృతిలో ఊహించని ట్విస్ట్:ఆ 'జ్యూసే' ఆమె ప్రాణాలను హరించిందా?
నిజానికి జయలలిత చాలా కచ్చితమైన డైట్ పాటించాల్సి ఉండగా.. నర్సులు ఎవరు ఆమెకు డైట్ గురించి చెప్పలేదని, అందువల్లే ఆమె జ్యూస్ తాగారని ఆ కథనం ద్వారా ప్రచారమవుతోంది.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అపోలో వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జయలలిత మృతికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసినా.. అనుమానాలు మాత్రం ఇంకా చాలామంది మెదళ్లకు వేలాడుతూనే ఉన్నాయి.
ఇదే నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమ్మ మరణించడానికి కారణం ఆమె తాగిన ఫ్రూట్ జ్యూసే అన్నది ఆ కథనం సారాంశం. ఆసుపత్రిలో జయలలిత బాగా కోలుకున్న తర్వాత.. ఒకరోజు పండ్ల రసం తాగారని, దానివల్ల ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆ కథనంలో పేర్కొన్నారు.

జయలలిత పండ్ల రసం తాగుతున్న సమయంలో నర్సులు, వైద్య సిబ్బంది ఎవరూ వారించలేదని, పండ్ల రసమే కదా! అని వారు తేలిగ్గా తీసుకున్నారని, చివరకు ఆ జ్యూసే జయలలిత ప్రాణాలకు ముప్పు తెచ్చిందని ఆ కథనంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
నిజానికి జయలలిత చాలా కచ్చితమైన డైట్ పాటించాల్సి ఉండగా.. నర్సులు ఎవరు ఆమెకు డైట్ గురించి చెప్పలేదని, అందువల్లే ఆమె జ్యూస్ తాగారని ఆ కథనం ద్వారా ప్రచారమవుతోంది. జయలలితకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చిన వ్యక్తి వివరాలు చెప్పేందుకు కూడా నర్సు నిరాకరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్స్ చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు కోర్టు మెట్లెక్కగా.. ప్రతిపక్షం డీఎంకె సైతం సీబీఐ విచారణకు పట్టుబడింది. నిజాయితీకి కేరాఫ్ గా ఉన్న ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐఆర్ఎస్ అధికారి బాలమురుగన్ తాజాగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత మృతికి సంబంధించి ఇప్పటికే ఇలాంటి పిటిషన్లు చాలావరకు దాఖలైన సంగతి తెలిసిందే. వీటన్నింటిని వచ్చే జూలై 4న విచారణకు స్వీకరించనున్నట్లు మద్రాసు హైకోర్టు తెలిపింది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications