వింత : సముద్రగర్భంలో పెళ్ళి, ప్రత్యేక ఉంగరాలు, దండలు మార్చుకొన్నజంట
ఓ ప్రేమికుల జంట కేరళలోని సముద్ర గర్బంలో పెళ్ళిచేసుకొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికతో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉంగరాలు, దండలతో గంటపాటు సాగింది.
కేరళ:పెళ్ళిని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. కాని, కేరళకు చెందిన ఓ ప్రేమజంట తమ పెళ్ళిని వేరైటీగా జరుపుకొని వార్తల్లో నిలిచారు.
సముద్రగర్భంలో వివాహం చేసుకొని ఈ ప్రేమ జంట వార్తల్లోకెక్కారు. మహరాష్ట్రకు చెందిన నికిల్ పవార్ ,స్లోవేకియన్ దేశానికి చెంది వధువు యూనికా పోగ్రాన్ లు సముద్ర గర్భంలో పెళ్ళిచేసుకొన్నారు.
సముద్ర గర్భంలో పెళ్ళిచేసుకొనేందుకు గాను కేరళ రాష్ట్రంలోని కోవలం సముద్ర గర్భంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులిద్దరూ ఉంగరాలు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దండలను మార్చుకొన్నారు.సముద్ర తీరంలోని బీచ్ వేదికగా ఈ కార్యక్రమం సాగింది.
ఈ వేడుక సుమారు గంటపాటు సాగింది. సైగల ద్వారా ఈ పెళ్ళి సందర్బంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కోవలం నగరంలోని జాక్సన్, బోండ్ సఫారీ సంస్థలు ఈ వినూత్న పెళ్ళి వేడుకలను నిర్వహించాయి.
సముద్ర గర్భంలో వివాహమంటే సంతోషంగా అన్పించినా, కొంత భయపడిన మాట కూడ వాస్తవమేనని వధువు యూనికా ప్రోగ్రాన్ చెప్పారు.అయితే కేరళ సముద్ర గర్భంలో జరిగిన ఈ పెళ్ళిని వరుడి స్వంత రాష్ట్రమైన మహరాష్ట్రలో రిజిష్టర్ చేసుకొన్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications