సమ్మర్ లో కచ్చితంగా 5 వ్యాధులు వస్తాయి.. నివారణ ఇలా!
ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ వ్యక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయి. 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వేడి తరంగాల ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువఉండేవారికి వడదెబ్బ తగులుతుంది. WHO చెబుతున్నదాని ప్రకారం.. ప్రతి సంవత్సరం 1.25 బిలియన్ల ప్రజలు వేడి తరంగాల బారిన పడుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రత ఆర్థికంగా వెనకబడినవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సామాజికంగా, మానసికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. రోజురోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరం లోపల ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలోని జీవక్రియ ప్రభావితమవుతుంది. ఉష్ణోగ్రత సాధారణానికి మించి ఉంటే శరీర సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని వల్ల హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, హైపెథెర్మియా ప్రమాదం పొంచివుంటుంది.

శ్వాస, గుండెకు సంబంధించిన వ్యాధుల వల్ల అనారోగ్యం కలగడంతోపాటు మూత్రపిండాలు, మానసిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మధుమేహం, మానసిక ఆరోగ్యం, స్ట్రోక్ తదితర వ్యాధుల కారణంగా ప్రజలు ఆసుపత్రిలో చేరే అవకాశాలున్నాయి. పగటిపూట 32 డిగ్రీల కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి. రాత్రివేళ 24 డిగ్రీలవద్ద స్థిరంగా ఉండాలి. రాత్రివేళల్లో కిటికీలు తెరిచి వుండటంతోపాటు విద్యుత్తును నిలిపివేయాలి.
రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చల్లని ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించాలి. బయటకు వెళ్లడం మానుకోవాలి. వ్యాయామం ఉదయంపూటే పూర్తికావాలి. శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. తేలికపాటి బట్టలు ధరించాలి. నిద్ర పోవడానికి నార మంచం వాడాలి. అంతేకాదు.. ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతుండాలి.












Click it and Unblock the Notifications