రోజూ చిటికెడు పొడి.. కొవ్వు మంచులా కరుగుతుంది!
మారిన ఆహారపు అలవాట్లు.. మారుతున్న జీవన శైలి.. అధిక సమయం కూర్చొని పనిచేయడంలాంటి కారణాలవల్ల బరువు విపరీతంగా పెరుగుతున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయకపోవడం కూడా ఒక కారణం. బరువు ఎక్కువగా ఉండటంవల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సులువుగా బరువు తగ్గేందుకు ఒక చిట్కాను సూచించారు నిపుణులు.
అవిసె గింజలు, అరకప్పు జీలకర్ర, పావు కప్పు సోంపు గింజలు, కప్పు కరివేపాకును సిద్ధం చేసుకోవాలి. ముందుగా వీటిని ఒక పాత్రలో వేసి వేయించాలి. తర్వాత మిక్సీ జార్ లో మెత్తని పొడిలా చేయాలి. గాలి తగలనిచోట దీన్ని నిల్వ చేయాలి. ఇలా తయారైన పొడిని ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ మోతాదు కలిపి తీసుకోవాలి. క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇది వాడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలుండవు. బరువు ఉండేవారు దీన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులతోపాటు బీపీ, షుగరు, హార్మోన్ల అసమతుల్యత... ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక సాధ్యమైనంత త్వరగా అధిక బరువు సమస్య నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో దుస్తులు కూడా వేసుకోలేరు. ఉన్న బట్టలన్నీ బాగా టైట్ అవుతాయి. ఈ తరహా సమస్య నుంచి బయటపడాలంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.












Click it and Unblock the Notifications