టీ తాగుతూ దమ్ము కొడుతున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!
చాలా మందికి టీ తాగేటప్పుడు ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. టీ తాగుతూ ధూమపానం చేస్తుంటారు. రిలాక్స్గా ఉండటం కోసం ఇలా చేసేవారు ఉన్నారు. అయితే, టీ తాగుతూ ధూమ పానం చేయడం అరోగ్యానికి అత్యంత హానీకరం అని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగానే ధూమపానం క్యాన్సర్కు కారణం. అలాంటి తరుణంలో ధూమపానం చేస్తూ టీ సేవించడం మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. టీ, సిగరెట్ కలయిక ఆరోగ్య ప్రమాదాలను మరింత రెట్టింపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం... టీతో కలిపి సిగరెట్ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం పెరుగుతుందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, వేడి టీ జీర్ణ కణాలను దెబ్బతీస్తుందని, టీ-సిగరెట్ను కలిపి తాగడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతినే ప్రమాదం రెండు రెట్లు పెరుగుతుందని పరిశోధన తేల్చింది. టీలో కెఫీన్ ఉంటుందని, దీని వల్ల కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవు తుందని, అయితే ఎక్కువ కెఫిన్ కడుపులోకి చేరితే హానికరం అంటున్నారు నిపుణులు. సిగరెట్ లో నికోటిన్ ఉంటుందని.. టీ, సిగరెట్ రెండూ రక్తపోటును పెంచుతాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

దీంతో, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగే అవకాశం ఉంటుంది. టీ, సిగరెట్ కలిసి తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ లాంటి ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు కలిపి తీసుకోవటం వలన గుండెపోటు ప్రమాదం, అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కడుపు పూత, నపుంసకత్వము, వంధ్యత్వం యొక్క ప్రమాదం, చేతులు, కాళ్ల పూత, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదం, తక్కువ ఆయుర్దాయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఇప్పటి వరకు ఈ రెండు కలిపి తీసుకోవటం అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవటం మంచిదని సూచిస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications