దీపావళి విశిష్టత: లక్ష్మీదేవిని పూజించే పద్ధతి.. ఆరోజు చేయాల్సినవి..
దీపావళి కన్నా కూడా ఈ రోజు ఉత్తర దక్షిణ భారతదేశంలోని వాళ్ళందరూ పూజించడం జగమెరిగిన సత్యం.
Recommended Video
అశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో ప్రదర్శనాలు నవరాత్ర వ్రతం అనేది జరుపుతారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు.
వెండి కొనడానికి ముఖ్యమైన రోజు గా చెప్తారు. అక్షయ తృతీయ బంగారానికి ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటే ఈ రోజుని ధన త్రయోదశిగా చెప్పుకుంటే ఈరోజు వెండి లోహాన్ని కొనడానికి ప్రశస్తమైనవిగా చెప్తారు.
ఈరోజు గుజరాతీయులకు సంవత్సరాది. అంటే మనకు ఉగాది లాగా విభజన జీవులకి ఉగాది అనమాట. దీపావళి సంవత్సరం తర్వాత గుజరాతీలు పొరుగు వారైన గుజరాతీయులు మహారాష్ట్ర వారు కలిసి కొన్ని పండుగలు కూడా జరుపుకుంటారు.
ఈ రోజు నాడు చేసే విశేష కార్యక్రమాలు
వారు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు అలికి రంగురంగుల ముగ్గులు పెడతారు. శుచిగా ఉంటే మహాలక్ష్మి వృద్ధి చెందుతుందని, అమ్మవారికి ఆనందమని ఇంటిని శుభ్రం చేసుకుంటారు. నిజానికి ఈ రోజు నుండే దీపాలు అలంకరించడం ప్రారంభమవుతుంది. తలస్నానము చేసి కొత్తబట్టలు కట్టుకుని పండగల జరుపుకోవడం విశేషం.
ఇంటిలో
ఉండే
బంగారు
వస్తువులను,
వెండి
వస్తువులను
పాలతో
కడిగి
నీళ్లతో
కడిగి
శుభ్రంచేసి
పువ్వులతో
పూజించి
అమ్మ
వారు
తమ
ఇంట్లోని
కొలువుండమని
ప్రార్థన
చేస్తారు.
ప్రత్యేకంగా
ఈ
రోజు
షావుకారు
వ్యాపారంలో
లాభాలు
కలగాలని
తమ
వస్తువులు
మనం
నిలువరించ
కొని
మరీ
వాటిని
పూజిస్తారు.
ప్రాచీనమైన కొన్ని గ్రంథాలలో ప్రకారం ఈరోజు వ్యాపారులు తమ వ్యాపారంలోని లెక్క ఉండంగా మొత్తం తేల్చుకుని వాటిలో రుణాలు రొక్కం మొదలైనవాటిని నిర్వహిస్తారు. మరొక విశేషమేమిటంటే ఈ పూజ కోసం మరణించిన పూర్వీకులు ఆకాశం నుండి తిరిగి వస్తారని కొందరి నమ్మకం. దాని ప్రకారం ధన త్రయోదశి రోజు సాయంకాలం రోడ్డు మీద దక్షిణ దిక్కుగా ఉండేలాగా దీపం ఉంచుతారు. ఈ దీపము మరణించిన పితృదేవతలకు దారి చూపిస్తుందని వారి వారి విశ్వాసం.
ఈనాటి నుంచి ప్రతి ఇంట్లోనూ వాటిల్లో సాయం దీపాలని ఉంచడం సంప్రదాయంగా మారింది. రాబోయే కార్తీక లక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ప్రతి ఇల్లూ సాయంకాలం శుభ్రపరచి ఇంటి ఇల్లాలు దీపాలతో అలంకారం చేయడం ఈరోజు నుండి ప్రారంభమవుతుంది.
వ్యాపారులు లక్ష్మీదేవిని పూజించే పద్ధతి
ధన త్రయోదశినాడు లెక్క యొక్క అన్ని చూసుకుని వ్యాపార గృహము లేదా షాప్ అందంగా కలిగి అలంకరించుకుని. వ్యాపారం చేయడం ఒక పూట వరకు ఆపి అమ్మవారిని పూజిస్తారు. ధనత్రయోదశి నాడు ప్రతి ఇంటికీ లక్ష్మీదేవి రావడం విశేషం.
దీపావళి కన్నా కూడా ఈ రోజు ఉత్తర దక్షిణ భారతదేశంలోని వాళ్ళందరూ పూజించడం జగమెరిగిన సత్యం. లక్ష్మీ దేవి అష్టోత్తర శతనామాలతో పూజించడం, పేదరికంలో ఉన్న వాళ్లు లక్ష్మీ తామర గింజలతో పూజించడం కొందరి షావుకార్ల ఇండ్లల్లో మనం చూస్తాం.
ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా వెండిని కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశినాడు ఎంత వెండిని గానం చేస్తారో అంతకు రెట్టింపు ఆ వెంటనే అమ్మవారు వారికి స్తుందని శాస్త్ర వాక్యం.