ఈ రాశులవారు ప్రధానమంత్రి కాలేరు.. రాశులవారీగా దేశ ప్రధానిగా పనిచేసినవారి జాబితా ఇదే!!
భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు మన దేశ ప్రధానిని నిర్ణయించబోతున్నాయి. ఎవరు దేశ ప్రధాని అవుతారు అన్న చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీనే అవుతారని భావిస్తుంటే, ఈసారి INDI కూటమి విజయం సాధిస్తుందని దేశ ప్రధానిగా INDI కూటమి అభ్యర్థులకు అవకాశం వస్తుందని చెబుతున్నారు.
10 రాశులవారికి ప్రధానిగా అవకాశం
అయితే జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం ఇప్పటివరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలలో మొత్తం 15 మంది ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. వీరిలో పది మంది వ్యక్తులు ఐదు రాశులకు చెందిన వారు కాగా మిగిలిన ఐదుగురు మరో ఐదు రాశులకు చెందినటువంటి వ్యక్తులు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు రాశుల వారు ప్రధాన మంత్రిగా నియమించబడలేదు.

మొత్తం 10 రాశుల నుండి 15 మంది ప్రధానులు
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పది మంది ప్రధాన మంత్రులు ఐదు రాశులకు చెందిన వారు దేశాన్ని పాలించారు కర్కాటకం,సింహం, కన్య, తుల మరియు వృశ్చిక రాశుల నుండి ఇద్దరిద్దరు ప్రధానులుగా పనిచేశారు. మిగిలిన అయిదుగురు ప్రధానులు ధనుస్సు, కుంభం, మకరం, మీనం మరియు మేషరాశి నుంచి ఒక్కొక్కరు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు.
ఏ రాశి నుండి ఎవరెవరు ప్రధానులుగా పని చేశారంటే
భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరు కర్కాటక రాశిలో జన్మించిన వారు. వీరిద్దరూ దేశానికి ప్రధానులుగా పనిచేశారు. మేషరాశి నుండి ఏప్రిల్ 1997 మార్చి 1998 వరకు కేవలం ఒక సంవత్సర కాలానికి ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా పనిచేశారు.ఇక సింహరాశి నుండి మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ ఇద్దరూ దేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేశారు.
వృశ్చిక రాశి నుండి మోడీతో పాటు అటల్ బిహారీ వాజ్ పేయి
కన్య రాశి నుండి లాల్ బహదూర్ శాస్త్రి, చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. తులారాశి నుండి విశ్వనాథ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ ప్రధాన మంత్రులుగా పనిచేశారు. వృశ్చిక రాశి నుండి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ, అటల్ బిహారి వాజ్పేయి ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు. ధనుస్సు రాశి నుండి గుల్జారి లాల్ నంద 13 రోజులపాటు తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు.
రెండు రాశులవారికి ప్రధాని పదవి దక్కలేదు
మకర రాశి నుండి ఇందిరా గాంధీ భారత ప్రధానిగా పనిచేశారు. కుంభరాశి నుండి హెచ్డి దేవేగౌడ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. మీనరాశి నుండి భారత దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు పనిచేశారు. అయితే ఇప్పటివరకు దాదాపు పది రాశుల నుండి భారతదేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు. కేవలం రెండు రాశుల వారు మాత్రం ఇప్పటివరకు ప్రధాని పదవి దరికి చేరలేదు. వృషభ రాశి నుండి, మిధున రాశి నుండి ఇప్పటివరకు ఎవరు ప్రధానమంత్రి కాలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications