రోహిణీ నక్షత్రంలోకి సూర్యుడు.. 25 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మే 25వ తేదీన మధ్యాహ్నం తన నక్షత్రాన్ని వదిలి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 8వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తుంటాడు. ఈ సమయంలో భక్తులంతా సూర్య భగవానుణ్ని పూజించడంతోపాటు ఉపవాసాలు చేస్తే జీవితంలో కోరుకున్నవన్నీ జరుగుతాయి. సూర్యుడు నక్షత్ర సంచారం చేయడంవల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.
ఖద్దరు దుస్తులు ధరించాలి
పెరుగు, పాలు, కొబ్బరి నీళ్లు, చల్లని పానీయాలను ఈ సమయంలో దానమిస్తారు. ఇలా దానం చేయడంవల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలోపేతమవుతుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి సంచారం చేయడంవల్ల కొన్ని విషవాయువులు వెలువడతాయి. ఈ సమయంల్ అనారోగ్యాన్ని కలిగించే ఆహారాలను ప్రజలు తీసుకోకూడదు. మహిళలు తమ శరీరాన్ని చల్లగా ఉంచేందుకు మెహిందీ పెట్టుకుంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన గ్లూకోజ్ స్థాయులు అందుతాయి. మరికొందరు ఖద్దరు దుస్తులు ధరిస్తారు. ఏయే రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
ఆర్థిక లాభాలుంటాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు ధనలాభం ఉంది. వ్యాపారాన్ని విస్తరించానలుకునేవారికి ఇది మంచి సమయం.
మిధున రాశి
కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడంతోపాటు అందరి మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. స్నేహితుల నుంచి లభించే మద్దతుతో లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
కర్కాటక రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.












Click it and Unblock the Notifications