ఈ 4 రోజులు జాగ్రత్తగా దాటితే గండం నుంచి బయటపడినట్లే
ఈనెల 16వ తేదీన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించి నెలరోజులు అక్కడే ఉంటాడు. అప్పటికే ఆ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగంవల్ల కొన్ని రాశులకు చాలా బాగుంటుంది. అయితే మరికొన్ని రాశులవారు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు, శుక్రుడి కలయికతో ఏర్పడిన రాజభంగ యోగం ఈనెల 25వ తేదీన ముగియనుంది. శుక్రుడు ఆరోజు నుంచి కన్యారాశిలో సంచారం చేస్తాడు. ఈ నాలుగు రోజులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
తులా రాశి
ఈ రాశివారికి అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో గొడవలు జరుగుతాయి. కార్యాలయంలో పనిచేసే సమయంలో ఎంత మౌనంగా ఉంటే అంత ఉత్తమం. ఆర్థికంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతారు. మితిమీరి చేసే ఖర్చును నియంత్రించుకోవాలి. లేదంటే మనసు ఎంతో కలవరపడుతుంది. ఈనెల 25వ తేదీ వరకు ఈ తరహా సమస్యలే ఎదురవుతాయి.

కర్కాటక రాశి
సూర్యుడు, శుక్రుడి కలయిక వీరికి శుభ ఫలితాలను ఇవ్వదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ లేకపోతే కష్టాలు తప్పవు. జీవితంలో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో ఆటంకాలు ఎదురవుతాయి. రానున్న నాలుగు రోజులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
మేష రాశి
శుక్రుడు, సూర్యుడి కలయిక వీరికి ఏమాత్రం కలిసిరాదు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. డబ్బుల పరంగా నష్టపోవడమేకాదు.. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారతాయి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది వాయిదా వేసుకోవడం ఉత్తమం.. అందులోను డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల మాటను అదుపులో ఉంచుకోకపోతే పరిస్థితులు మీచేయి దాటిపోతాయి. ఆరోగ్యం బాగుండదు.












Click it and Unblock the Notifications