రాజవైభోగానికి ఇంకా మూడురోజులే సమయం
జ్యోతిష్యంలో బుధుడు తెలివితేటలకు, వ్యాపారానికి, తార్కికానికి, ప్రసంగానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారణమవుతాడు. బుధుడి గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఆయా రంగాలపై ప్రత్యేకంగా ప్రభావం పడుతుంది. నవంబరులో బుధుడు రెండుసార్లు సంచరించనున్నాడు. ఈనెల ఆరోతేదీన వృశ్చికరాశిలోకి ప్రవేశించగా, 27న ధనుస్సు రాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీని ప్రభావం వ్యక్తిగత జాతకంలోని స్థానాలపై ఆధారపడివుంటుంది. బుధుడు ప్రత్యేక స్థానంలో ఉంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదే ప్రతికూల స్థానంలో ఉంటే విపరీతమైన నష్టాలతోపాటు కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మూడు రాశులవారికి బాగా కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
కన్య రాశి : వాహనం, ఆస్తి ప్రయోజనాన్ని పొందుతారు. ధైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఊహించని రీతిలో ద్రవ్య లాభాలుంటాయి. విదేశాలకు సంబంధించినదైతే మంచి లాభాన్ని పొందుతారు. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. పూర్వీకాల ఆస్తి కలుస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

మకర రాశి : ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో పొదుపు చేయడంద్వారా విజయం సాధిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. వాటి నుంచి లాభాలు రానున్నాయి.
మేష రాశి : అదృష్టం తోడుగా నిలుస్తుంది. గతంలో మొదలై ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మతపరమైన కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. డబ్బుకు సంబంధించి ఏ పనిచేసినా విజయం సాధిస్తారు. పనికోసం లేదంటే వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలుంటాయి. పరిశోధన రంగానికి అనుబంధంగా ఉండేవారికి మంచి ప్రయోజనాలున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధపడుతున్నవారు ఉత్తీర్ణులవుతారు.












Click it and Unblock the Notifications