కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్స్
అతి తక్కువ సమయంలోనే రెట్టింపునకు పైగా రిటర్న్స్ ఇచ్చేవాటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో ఈ ఐదు కంపెనీలకు చెందిన మల్టీబ్యాగర్ స్టాక్స్ లో డబ్బులు రెట్టింపయ్యాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. నిఫ్టీ 19,800 పాయింట్లు, సెన్సెక్స్ 66,500 దాటాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు మంచి ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి.
* Olectra Greentech: ఎలక్ట్రికల్ బస్సులు, పాలిమర్ ఇన్సులేటర్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు 141% రాబడిని ఇచ్చి మల్టీ బ్యాగర్ స్టాక్ గా మారింది. ఈ సంస్థ షేరు శుక్రవారం రూ.1,248 వద్ద ముగిసింది.

* Mazagon Dock Shipbuilders: మజగాన్ డాక్షిప్ బిల్డర్స్ కంపెనీలో ప్రభుత్వానికి 84% వాటా ఉంది. ఈ ఏడాది పెట్టుబడిదారులకు 181% రాబడిని అందించింది. సంవత్సర కాలంలో చూస్తే 400% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఈ సంస్థ షేరు శుక్రవారం రూ.2,219 వద్ద ముగిసింది.
* JBM Auto: ఆటో సిస్టమ్స్, బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ. ఈ కంపెనీ షేర్లు ఇప్పటివరకు పెట్టుబడిపై 188% రాబడినిచ్చాయి. శుక్రవారం గరిష్టంగా రూ. 1,503ని తాకింది. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ షేర్ల ధరలు 140% చొప్పున పైకెగశాయి.
* Suzlon Energy: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అయిన సుజ్లాన్ ఎనర్జీ ప్రొవైడర్ గత మూడు సంవత్సరాల్లో 600% పెరిగింది. ఏడాదిలో 172% పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రీన్ ఎనర్జీ స్టాక్ 124% లాభపడింది. శుక్రవారం రూ.24.12 దగ్గర ముగిసింది.
* Apar Industries: ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం, అల్లాయ్ కండక్టర్ తయారీ సంస్థ అపార్ ఇండస్ట్రీస్. ఇన్వెస్టర్లకు 166% రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ల ధరలు ఈ సంవత్సరంలో మూడు రెట్లు పెరిగాయి. శుక్రవారం ఈ షేరుధర రూ.4,866 వద్ద ముగిసింది.
పైన పేర్కొన్న కంపెనీల స్టాక్స్ అన్నీ మల్టీబ్యాగర్ స్టాక్స్ అయ్యాయి. వీటిని రికమండేషన్స్ స్టాక్ గా భావించకూడదు. ఎవరైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెబీ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ను అడిగి సలహా తీసుకోవాలి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications