Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే!

జీవితంలో ఏలినాటి శని ప్రభావం మొదలైందంటే చాలు.. అడుగు తీసి అడుగు వేయాలన్నా భయం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మానసిక ఆందోళనలతో సతమతమయ్యే భక్తులకు అభయమిచ్చే అద్భుత క్షేత్రం తమిళనాడులోని తిరుక్కొళ్లికాడు. ఇక్కడ కొలువైన శనీశ్వరుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలిగి 'పొంగు' (అభివృద్ధి) కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ స్వామిని 'పొంగు శని' అని భక్తితో పిలుచుకుంటారు.

సాధారణంగా ఏలినాటి శని మూడు దశల్లో వస్తుంది. మొదటి దశ (మంగు శని), రెండో దశ (పొంగు శని), మూడో దశ (మరణ శని). వీటిలో అత్యంత కీలకమైన రెండో దశలో భక్తులను కరుణించేందుకు శనీశ్వరుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఇది కేవలం శని ఆలయమే కాదు.. పరమేశ్వరుడు మూలమూర్తిగా పూజలందుకునే దివ్యక్షేత్రం. ఇక్కడ శివుడిని అగ్నీశ్వరర్‌ అని పిలుస్తారు. అగ్నిదేవుడు తన శాప విముక్తి కోసం ఇక్కడ తపస్సు చేసి శివుడి అనుగ్రహం పొందాడని స్థలపురాణం చెబుతోంది.

Visit Pongu shani Temple in Thirukollikadu A Divine Remedy for Elinati shani and Financial Troubles

శనికి 'ఈశ్వరుడు' అనే పేరు ఎలా వచ్చింది?

భక్తులు తనను చూసి భయపడుతూ, దూషిస్తున్నారని బాధపడిన శని భగవానుడు.. వశిష్ట మహర్షి సూచన మేరకు ఇక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శని భక్తికి మెచ్చిన భోళాశంకరుడు.. "నిన్ను దర్శించుకున్న భక్తులకు కష్టాల నుంచి విముక్తి కలిగి, శుభాలు కలుగుతాయి" అని వరాన్ని ప్రసాదించాడు. అంతేకాకుండా, తన పేరులోని 'ఈశ్వరుడు' అనే బిరుదును శనికి జోడించి.. అప్పటి నుండి ఆయనను 'శనీశ్వరుడు'గా పిలిచేలా గౌరవించాడు. ఇక్కడ స్వామి తన వాహనమైన కాకితో, చేతిలో నాగలి పట్టుకుని రైతు రూపంలో అభయమిస్తూ దర్శనమివ్వడం మరో విశేషం.

 100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!

ఆలయ విశిష్టతలు.. అద్భుత దృశ్యాలు!

  • అరుణవర్ణ లింగం: శివాలయాల్లో లింగాలు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ అగ్నికి ప్రతీకగా శివలింగం లేత ఎరుపు (అరుణ) రంగులో ఉంటుంది.
  • నవగ్రహాల వింత: ఇతర ఆలయాల్లో నవగ్రహాలు వివిధ దిశల్లో ఉంటే.. ఇక్కడ మాత్రం గ్రహాలన్నీ ఎదురెదురుగా ఉండి భక్తులను ఆశీర్వదిస్తాయి.
  • ధనుర్బాణ సుబ్రహ్మణ్యుడు: మరెక్కడా లేని విధంగా సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ధనుర్బాణాన్ని ధరించి యుద్ధ వీరుడిలా కనిపిస్తాడు.
  • కుబేర స్థల ప్రభావం: ఇక్కడ శనీశ్వరుడు కుబేర స్థానంలో ఉండటం వల్ల, ఈ స్వామిని దర్శించుకుంటే పోయిన సంపద తిరిగి వస్తుందని, వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుందని భక్తుల నమ్మకం.

ఎలా వెళ్లాలి?

తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లాలో ఈ ఆలయం ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు తిరువారూర్‌ రైల్వేస్టేషన్ లో దిగి. ఆటో లేదా బస్ ద్వారా అరగంట ప్రయాణంతో ఆలయానికి చేరుకోవచ్చు. విమాన మార్గంలో వచ్చే భక్తులు తిరుచిరాపల్లి (ట్రిచీ) ఎయిర్‌పోర్టులో దిగి, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కొళ్లికాడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు.

ఏలినాటి శని నుంచి ఈ రాశులకు విముక్తి... అన్నీ రాజభోగాలే
ఏలినాటి శని నుంచి ఈ రాశులకు విముక్తి... అన్నీ రాజభోగాలే

ముఖ్యంగా శనిత్రయోదశి, శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఇక్కడ జమ్మి వృక్షం వద్ద పూజలు నిర్వహించి, స్వామికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే సకల దరిద్రాలూ తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+