వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశం కసరత్తు ప్రారంభం
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ కసరత్తును ప్రారంభించింది. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారి సమావేశాలను మంత్రులు, సంబంధిత శాసనసభ్యులు ఏర్పాటు చేశారు.
ఈ సమావేశాల్లో అభ్యర్ధుల పానెల్స్ను తయారు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇది ప్రాధమిక సమావేశమని ఈ సమావేశాల్లో తయారుచేసిన పానెల్స్ నుంచి అభ్యర్ధుల తుది జాబితాను తయారు చేస్తారని సీనియర్నేత హోం మంత్రి దేవేంద్రగౌడ్ చెప్పారు. ఎన్నికల ప్రచారం తెలంగాణా వంటి సున్నితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలోకి తీసుకుపోతున్నది తమ పార్టీ మాత్రమేనని ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, June 19, 2001, 23:53 [IST]