కేంద్రం హెచ్చరిలు పట్టించుకోని జయ
న్యూఢిల్లీ, చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం చేసిన హెచ్చరికలకు ఎలాంటి రాజ్యాంగబద్దత లేదని తమిళనాడు న్యాయశాఖా మంత్రి పొన్నయ్యన్ స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దతలేని కేంద్రం హెచ్చరికను తాము ఖాతరు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇదిలావుండగా, కరుణానిధి అరెస్టు సమయంలో పోలీసుల ప్రవర్తనను తమిళనాడు డిజిపి రవీంధ్రనాధ్ పూర్తిగా సమర్ధించుకున్నారు. అరెస్టు సమయంలో పోలీసులు చట్టబద్దంగానే ప్రవర్తించారని ఆయన అన్నారు. కరుణానిధితో నతకు ఎలాంటి వ్యక్తిగత కక్షాలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు చెన్నైలో మాట్లాడుతూ కేంద్రం హెచ్చరికలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తప్పవని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరుణానిధి అరెస్టు సమయంలో చట్టవ్యతిరేకంగా ప్రవర్తంచిన తమిళనాడు పోలీసులను డిజిపి వెనకేసుకు రావటం సబబు కాదని ఆయన అన్నారు.
కేంద్ర కమ్యునికేషన్ల శాఖా మంత్రి పాశ్వాన్ న్యూఢిల్లీలో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరిని మానుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంతో ఘర్షణపడటం సరైంది కాదని ఆయన అన్నారు.
- కరుణానిధి హత్యకు కుట్ర
- జయకు వార్నింగ్ తో సరిపెట్టిన కేంద్రం
- జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి
- తమిళ పోలీసులకు కోర్టు చీవాట్లు
- బెయిలు వద్దంటున్న కరుణానిధి
- జయ ప్రభుత్వ రద్దుకు దేశం వ్యతిరేకం
- రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు