మాటతప్పిన ముషారఫ్ పై భారత్ గరం
న్యూఢిల్లీః హురియత్ కాన్ఫరెన్స్ నేతలను పాక్ అధ్యక్షుడు ముషారఫ్ తేనీటి విందుకు ఆహ్వానించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై చర్చించేందుకు రక్షణ, హోంశాఖల ఉన్నత స్థాయి సమావేశం గురువారం హుటాహుటిన సమావేశమైంది. ఈ సమావేశాన్ని మామూలు సమావేశం అని కేంద్రం చెప్పినప్పటికీ భారత్ మాటను కాదని ముషారఫ్ హురియత్ నేతలతో కలవాలనే వివాదాస్పద నిర్ణయంపైనే చర్చించినట్లు తెలిసింది.
ముషారఫ్ భారత్ వచ్చిన సందర్భంగా హురియత్ నేతలతో కలవరాదని వాజ్ పేయి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది. అయితే భారత్ సూచనలను కాదని ముషారఫ్ హురియత్ నేతలను విందు సమావేశానికి హాజరు కావలసిందిగా ఆహ్వానం పంపారు. ముషారఫ్ చర్యను భారత్ వ్యతిరేకించడంతో పాటు భారత్-పాక్ మధ్య చారిత్రాత్మక చర్చల అవకాశాన్ని జారవిడుచుకోవద్దని భారత విదేశాంగ శాఖ పాక్ కు హితవు చెప్పింది.
మరోవైపు ముషారఫ్ తమను విందుకు కాకుండా ఏకంగా చర్చలకు ఆహ్వానిస్తే బాగుండేదని హురియత్ నేతలు అన్నారు. ముషారఫ్ ఆహ్వానంపై గురువారం శ్రీనగర్ లో సమావేశంమైన హురియత్ నేతలుసుదీర్ఘంగా చర్చలు జరిపారు.
-
హురియత్పై
బాణీ
మార్చినముషర్రాఫ్