వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవసరమొచ్చినప్పుడేరాజకీయాలు: పివి
హైదరాబాద్: దేశరాజకీయాలపై అవసరం వచ్చినప్పడుమాట్లాడుతానని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుఅన్నారు. తమిళనాడులోని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనిరాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకుఆయన నిరాకరించారు. తన 81వ జన్మదినోత్సవాన్ని ఆయన ఇటీవల జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయనను రాజభవన్లో అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ వయసులో కూడాతాను ఆరోగ్యంగానే వున్నానని ఆయన తనను కలుసుకున్నవిలేకరులతో అన్నారు.
తమిళనాడులో కరుణానిధి,ఇద్దరు కేంద్ర మంత్రుల అరెస్టు, ఆ రాష్ట్రంలోరాజకీయ పరిస్థితులపై పత్రికలవారు ఎన్ని ప్రశ్నలువేసినా ఆయన సమాధానం చెప్పలేదు.రాజకీయాలపై వ్యాఖ్యానించేందుకు ఇప్పుడు తానున్నచోటు సరైనది కాదని ఆయన అన్నారు.
క్రియాశీలక రాజకీయాల్లో తిరిగిచురుగ్గా పాల్గొనే విషయంపై అడిగిన ప్రశ్నలకు కూడాఆయన సమాధానాలు చెప్పలేదు.
Comments
Story first published: Thursday, July 5, 2001, 23:53 [IST]