26-7-2001గురువారం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పర్యటనకు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. పర్వేజ్ ముషారఫ్ పంపిన లేఖను పాకిస్థాన్ హై కుషనర్ అష్రఫ్ జహంగీర్ ఖాజీ భారత దేశాంగ శాఖ కార్యదర్శి చోకిలా అయ్యర్కు శనివారం అందజేశారు. పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా కోరుతూ ప్రధానికి ముషారఫ్ నుంచి ఈ ఆహ్వానం అందింది.
భారత దేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్కు ఇదివరకే పాకిస్థాన్ దేశాంగ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ నుంచి ఆహ్వానం అందింది. వాజ్పేయి పాకిస్థాన్ పర్యటనకు తేదీలు మాత్రం ఖరారు కాలేదు. వాజ్పేయి పాకిస్థాన్ పర్యటనకు ముందు జస్వంత్ సింగ్ సెప్టెంబర్లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లవచ్చునని భాస్తున్నారు.












Click it and Unblock the Notifications