వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆగస్టు ఆఖరులో పంచాయితీ ఎన్నికలు
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు ఆఖరు వారంతో ప్రారంభించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుట వున్నట్టుగా తెలుస్తున్నది.
ఎన్నికల సన్నాహంలో భాగంగా ఈ నెల 30న ఎన్నికల కమిషన్ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో వివిధ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియమొత్తం పూర్తియిన కారణంగా ఎన్నికలకు ఏలాంటి ఆటంకాలు వుండవని అధికారులు కూడా భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, July 27, 2001, 23:53 [IST]