రంగారెడ్డి జడ్పీ దేశంపరం!
న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీ ఎంపి ఫూలన్దేవి దారుణ హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు ప్రధాన నిందితునిగా భావిస్తున్నషేర్సింగ్రాణా అలియాస్ పంకజ్ను అరెస్టు చేశారు. పంకజ్ను డెహ్రాడూన్లోఅరెస్టు చేశారని శుక్రవారం నాడు ఇంటరాగేషన్కు కోసం ఢిల్లీ తీసుకువస్తున్నారని పోలీసులు చెప్పారు.
రవీంద్ర అనే మరో వ్యక్తితో కలసి ఫూలన్ హత్యకు తానే పాల్పడినట్టుగా పంకజ్అంగీకరించినట్టుగా పోలీసులు చెప్పారు. ఫూలన్ బంధువులుగా చెప్పుకుంటున్న ఉమాకాశ్యప్ ఆమె భర్తవిజయ్కి చెందిన ఆకుపచ్చ మారుతికి పంకజ్ డ్రైవర్గా వున్నారు. ఉమా దంపతులు గురువారం నాడుఇదే కారులో రూర్కీ నుంచి ఢిల్లీ వచ్చారు.
తన కారు చెడిపోవడంతో ఫూలన్ ఇదే కారులో ఉదయం పార్లమెంట్కు వెళ్లారు. మధ్యాహ్నం సమాజ్వాదికే చెందిన మరో ఎంపి జీపులో భోజనానికి ఫూలన్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటివద్ద పొంచుకుని వున్న హంతకులు పంకజ్కు బాగా తెలిసినవారై వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.