మహిళా మోర్చా పదవికివిజయశాంతి రాజీనామా
చెన్నై: బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సినీనటివిజయశాంతి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆమె బిజెపి జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తికి పంపించారు. బిజెపి మిత్రపక్షమైన డిఎంకె ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అవమానించిన తీరును తాను భరించలేకపోతున్నానని,అందుకే పదవికి రాజీనామా చేశానని ఆమె చెప్పారు. అన్నాడియంకెలో చేరుతారా అని ప్రశ్నిస్తే బిజెపిలో కొనసాగుతానని ఆమె సమాధానమిచ్చారు.
ఆందోళనకారులు జయలలితకు, మాజీ గవర్నర్ ఫాతిమా బీవీకి వ్యతిరేకంగా దూషణలతో కూడిని నినాదాలు ఇచ్చారని, అసభ్య పదజాలం వాడారని, మహిళా పోలీసులను కూడా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె అన్నారు. తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆమె అన్నారు. తాను పార్టీలో చేరింది మహిళల ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని కాపాడడానికేనని ఆమె అన్నారు. ర్యాలీ సందర్భంగా డిఎంకె నాయకులు, కార్యకర్తలు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలలు వంచుకునేలా వుందని, వారి పోకడ యావత్తు మహిళా లోకం ఆవేదనతో కుంగిపోయేలా వుందని ఆమెవిమర్శించారు. డిఎంకె చేపట్టిన విధానం భారతీయ సంస్కృతిని, మర్యాదలను మంట గలిపేదిగా వున్నదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications