వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఫ్యాక్షనిస్టులు పంజావిసిరారు. ఆదివారం మధ్యాహ్నం ఒక వర్గం వారు మరో వర్గంవారిపై జరిపిన దాడిలోఅమ్మిశెట్టి శ్రీహరి (28) అనే వ్యక్తి మరణించాడు. ఈ హత్యకు ప్రతీకారంగా రెండో వర్గం గ్రామంలో విధ్వంసం సృష్టించి, దహనకాండకు పాల్పడింది. దీంతో రెచ్చిపోయిన ప్రత్యర్థి వర్గం వారు బాంబు దాడులకు దిగారు. ఒక మోపెడ్‌, మోటార్‌సైకిల్‌, నాలుగు గృహాలు, రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక షాపును, కిళ్లీకొట్టును, ఎస్‌టిడి బూత్‌ను, హోటల్‌ను ధ్వంసం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్నవారిని అదుపు చేయడానికి పోలీసులు 30 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ బీభత్సకాండలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

గ్రామంలో అమరావారి కుటుంబం,అమ్మిశెట్టివారి కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా వైషమ్యాలు నెలకొని ఉన్నాయి.జూన్‌ నెలలో అమరా వసంత వర్గీయులు అమ్మిశెట్టి రవి వర్గంపై బాంబు దాడి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అమరా వసంతతో పాటు ఆరుగురిని ఇటీవల పోలీసులుఅరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలయిన వసంత వర్గం తిరిగి అదను చూసి రవి వర్గానికి చెందిన శ్రీహరిపై మారణాయుధాలతో దాడి చేసి అతడ్ని దారుణంగా హత్య చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X