రెండో రోజు సిమి కార్యకర్తలఅరెస్టులు
న్యూఢిల్లీ: రెండవ రోజు కూడా దేశవ్యాప్తంగా స్టూడెట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) నాయకుల, కార్యకర్తల అరెస్టులు జరిగాయి. శనివారంనాడు పోలీసులు దేశవ్యాప్తంగా 150 మంది సిమి కార్యకర్తలనుఅరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 450కి చేరుకుంది. అయితే, సిమిసెక్రటరీ జనరల్ సఫ్దర్ నగోరి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్ని సిమి శాఖల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు.
సిమి కార్యాలయాలకు తాళాలు వేశారు. నిషేధం తర్వాత శనివారం హింసాత్మక సంఘటనలేవీ చోటు చేసుకోకపోవడంతో పోలీసులు హాయిగా గాలిపీల్చుకున్నారు. లక్నోలో కూడా పరిస్థితి మెరుగైంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 70 మంది సిమి కార్యకర్తలనుఅరెస్టు చేశారు. సిమిపై నిషేధాన్ని పలు ముస్లిం సంస్థలువిమర్శించాయి. సిమి నిషేధం ఇస్లాంపై దాడి అని వ్యాఖ్యానించాయి. సిమిని నిషేధించడం ఇస్లాంపై ప్రత్యక్ష దాడికి పూనుకోవడమేనని జమాత్-ఎ-ఇస్లామీ నాయకుడు సయ్యద్ అలీ షా అన్నారు.
హైదరాబాద్లో
శుక్రవారం
అరెస్టు
చేసిన
ఐదుగురు
సిమి
రాష్ట్ర
నాయకులనుపోలీసులు
శనివారం
కోర్టులో
హాజరు
పరిచారు.
భారీ
సాయుధ
బందోబస్తు
మధ్య
వారిని
పోలీసులు
కోర్టుకు
తెచ్చారు.
వెంటనే
వారికి
బెయిల్
మంజూరయింది.