ఉద్యోగం ట్రాన్స్ లేటర్ -ఆస్తి కోటిన్నర
హైదరాబాద్ః సచివాలయంలోట్రాన్స్ లేటర్ గా ఉద్యోగం చేస్తూ కోట్లు గడించిన నారాయణ ఎసిబి వలలో చిక్కాడు. బి. నారాయణ రావు అనే వ్యక్తి జీతం నాలుగంకెల లోపే. అయితే ఈయన భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు సమాచారంఅందడంతో ఎసిబి ఆయనపై వలపన్నింది. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేసివిలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. సుమారు 65 లక్షలువిలువ చేసే మూడు ఇళ్ళు, పది లక్షలు విలులచేసే ఓఅపార్ట్ మెంట్, లక్షలాది రూపాయల డిపాజిట్లు ఆయనపేరుమీద వున్నట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారు.
పదివేల రూపాయల లోపు జీతం వున్న వ్యక్తి కోటిన్నర రూపాయలు ఆర్జించాడంటే అవినీతి ఏ స్థాయిలో వున్నదోఅర్థ చేసుకోవచ్చు. అయితే ఈ ఆస్తులన్నీ తన తండ్రి నుంచి సంక్రమించాయని నారాయణ రావు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఎ.సి.బి. దర్యాప్తు ప్రారంభించింది. అవినీతికి పాల్పడుతున్న మరి కొందరు ఉన్నతాధికారు భరతం కూడా పడతామని ఎసిబి డైరెక్టర్ రామావతార్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.